Diya Worship: దీపారాధనకు పాత ప్రమిదలు వాడొచ్చా? పండితులు ఏమంటున్నారు?
పండితులు ఏమంటున్నారు?
Diya Worship: దీపావళి వచ్చిందంటే ఇల్లంతా దీప కాంతులతో వెలిగిపోతుంది. ముఖ్యంగా మట్టి ప్రమిదలకు ఈ పండుగలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ప్రతి ఏటా కొత్త ప్రమిదలు కొనాలా? గత దీపావళికి వాడిన పాత ప్రమిదలను శుభ్రం చేసి తిరిగి ఉపయోగించవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంపై ఆధ్యాత్మిక పండితులు, శాస్త్రాలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం, ఒకసారి పూజలో ఉపయోగించిన వస్తువును తిరిగి ఉపయోగించే విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మట్టి దీపావళి రోజున సాయంత్రం వేళ నిర్వహించే ప్రధాన లక్ష్మీ పూజలో ఉపయోగించే ప్రమిదలు లేదా కుందులు కొత్తవి లేదా లోహంతో (వెండి, ఇత్తడి, కంచు) తయారు చేసినవి మాత్రమే వాడటం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఒకసారి పూజలో వాడిన మట్టి ప్రమిదలు ఆ పూజా శక్తిని, అలాగే దీపం ఆరిపోయిన తర్వాత దానిలోని ప్రతికూలతలను గ్రహిస్తాయని నమ్ముతారు. శుభప్రదమైన దీపావళి పూజకు కొత్త శక్తి, సానుకూలత అవసరం కాబట్టి, లక్ష్మీదేవి పూజలో ఉపయోగించే దీపాలు కొత్తవి అయి ఉండాలి. లక్ష్మీ పూజకు కొత్త ప్రమిదలు లేదా లోహపు కుందులు వాడాలి. ఇంటి అలంకరణకు శుభ్రం చేసిన పాత ప్రమిదలను నిస్సందేహంగా వాడుకోవచ్చు. పగిలిన ప్రమిదలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. దీపారాధన అంటే కేవలం ప్రమిదల్లో దీపం వెలిగించడమే కాదు, అంతరంగంలో జ్ఞాన కాంతిని వెలిగించడం. శుభ్రమైన, స్వచ్ఛమైన మనస్సుతో దీపం వెలిగిస్తే మహాలక్ష్మి దేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది.