Pandavas Die During the Mahaprasthan: మహాప్రస్థానంలో పాండవులు ఎలా చనిపోయారు ?

ఎలా చనిపోయారు ?

Update: 2026-07-31 04:29 GMT

Pandavas Die During the Mahaprasthan: మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసి, దాదాపు 36 ఏళ్ల పాలన తర్వాత శ్రీకృష్ణ నిర్యాణం వార్త విన్న పాండవులు ఐహిక జీవితంపై విరక్తి చెందారు. తమ మనవడైన పరిక్షిత్తుకు హస్తినాపుర రాజ్య బాధ్యతలను అప్పగించి, పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి ముక్తిని వెతుక్కుంటూ స్వర్గారోహణ కోసం హిమాలయాల వైపు పయనమయ్యారు. ఈ చివరి ప్రయాణాన్నే 'మహాప్రస్థానం' అంటారు.

పాండవులు హిమాలయాల్లోని మేరు పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు, వారితో పాటు ఒక కుక్క కూడా ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, శరీరంతో స్వర్గానికి చేరుకోవడం అత్యంత కఠినమైన కార్యం. ప్రయాణంలో ఒక్కొక్కరిగా తమలోని చిన్న చిన్న లోపాల వల్ల దారిలోనే పడిపోయి ప్రాణాలు విడిచారు.

ద్రౌపది: అందరికంటే ముందుగా ద్రౌపది కిందపడి మరణించింది. ఐదుగురు భర్తలను సమానంగా చూడాల్సిన ద్రౌపదికి అర్జునుడిపై కాస్త ఎక్కువ ప్రేమ ఉండేదని, ఆ పక్షపాత బుద్ధి వల్లే ఆమె స్వర్గానికి చేరుకోలేకపోయిందని ధర్మరాజు వివరించారు.

సహదేవుడు: ఆ తర్వాత ఐదుగురు సోదరులలో చిన్నవాడైన సహదేవుడు పడిపోయాడు. సహదేవుడు ఎంతో గుణవంతుడైనప్పటికీ, లోకంలో తనకంటే తెలివైనవాడు లేడనే అహంకారం ఉండటం వల్ల అతడు మధ్యలోనే ప్రాణాలు విడిచాడు.

నకులుడు: సహదేవుడి తర్వాత నకులుడు ప్రాణాలు కోల్పోయాడు. నకులుడు రూపవంతుడే అయినప్పటికీ, ప్రపంచంలో తనకంటే అందగాడు లేడనే ఆత్మసౌందర్య గర్వం అతనిలో ఉండటమే మరణానికి కారణమైంది.

అర్జునుడు: ఆ తర్వాత గొప్ప వీరుడైన అర్జునుడు కిందపడిపోయాడు. ప్రపంచంలో తనకంటే గొప్ప ధనుర్ధారి లేడని, శత్రువులందరినీ ఒక్క రోజులోనే అంతం చేస్తానని గర్వంగా మాట్లాడటమే కాకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల అర్జునుడికి ఈ గతి పట్టింది.

భీముడు: చివరగా మహా బలశాలి అయిన భీముడు పడిపోయాడు. భీముడికి తన భుజబలంపై తీవ్రమైన అహంకారం ఉండేదని, అంతేకాకుండా తిండి విషయంలో ఆశ మరియు ఇతరులను తక్కువ చేసి మాట్లాడే అలవాటు వల్ల అతడు కూడా స్వర్గానికి చేరుకోలేకపోయాడు.

మిగిలిన సోదరులు, ద్రౌపది చనిపోతున్నా ధర్మరాజు ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా తన ధర్మమార్గాన్నే అనుసరించారు. చివరకు ధర్మరాజు ఆయనతో వచ్చిన కుక్క మాత్రమే మేరు పర్వత శిఖరానికి చేరుకోగలిగారు. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానించగా, తదనంతరం ఆ కుక్క స్వయంగా ధర్మదేవతగా మారి ధర్మరాజు యోగ్యతను మెచ్చుకుని సదేహంగా స్వర్గానికి తీసుకెళ్లారు.

Tags:    

Similar News