Saturn Transit 2027: శని సంచారం 2027: ఆ మూడు రాశుల వారికి సడేసతి, ధైయా కష్టాల నుండి విముక్తి..
సడేసతి, ధైయా కష్టాల నుండి విముక్తి..
Saturn Transit 2027: జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. జాతకంలో శని సడేసతి లేదా ధైయా కాలం నడుస్తున్నప్పుడు సదరు వ్యక్తులు తీవ్రమైన శ్రమ, మానసిక ఒత్తిడి, పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే 2027లో జరగబోయే శని గ్రహ సంచారం కొన్ని రాశుల వారి కష్టాలకు పూర్తిగా ముగింపు పలకబోతోంది. ప్రఖ్యాత జ్యోతిష్కుల సమాచారం ప్రకారం.. 2027లో శని దేవుడు తన స్వరాశి అయిన కుంభాన్ని విడిచిపెట్టి, కుజుడికి అధిపతి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.ఈ మార్పు వల్ల మూడు ప్రధాన రాశుల వారికి శని పీడ వదిలిపోనుంది.
శని ప్రభావం నుండి విముక్తి పొందే ఆ 3 రాశులు ఇవే..
కుంభ రాశి: ప్రస్తుతం శని సడేసతి చివరి దశను అనుభవిస్తున్న కుంభ రాశి వారికి 2027 శని సంచారంతో ఈ పీడ పూర్తిగా ముగుస్తుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న శని ధాయం ప్రభావం నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారిని వేధిస్తున్న అష్టమ శని ధాయం ముగిసిపోతుంది.
జీవితంలో సానుకూల మార్పులు.. పెరగనున్న ఆర్థిక స్థిరత్వం..
శని యొక్క తీవ్ర ప్రభావం తొలగిపోవడంతో ఈ మూడు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి, కొత్తగా కెరీర్ ప్రారంభించడానికి అద్భుతమైన యోగం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి, రావాల్సిన పాత ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
మేష రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు..
2027లో శని దేవుడు మేషరాశిలోకి ప్రవేశిస్తుండటంతో.. ఆ రాశి అధిపతి అయిన కుజుడితో శని ప్రభావం కలవబోతోంది. ఈ కాలంలో మేష రాశి వారు ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందడానికి తమ ఇష్టదైవాలైన హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి సూర్య భగవానుడిని క్రమం తప్పకుండా పూజించడం మంచిది.
శని దోష నివారణకు సులభమైన పరిహారాలు..
జాతకంలో శని సడేసతి, ధైయా లేదా శని మహాదశ నడుస్తూ ఇబ్బందులు పడుతున్న వారు ఈ క్రింది పరిహారాలు పాటించవచ్చు..
హనుమాన్ చాలీసా:
ప్రతిరోజూ క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శనితో పాటు రాహు, కేతువుల ప్రతికూల ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
నలుపు రంగు వస్తువుల దానం: శనివారం రోజున నల్లని దుస్తులు ధరించడం లేదా అవసరార్థులకు నల్లటి వస్తువులు, ఆహారాన్ని దానం చేయడం వల్ల శని దేవుడు శాంతిస్తాడు.