సింధ్ ప్రాంతంలో తాగునీటి కటకట.. జనం తిరుగుబాటు

Update: 2025-05-21 11:58 GMT
  • అంతర్యుద్ధం దిశగా పాకిస్థాన్!!
  • తాగునీరు దూరం చేస్తున్నారంటూ తిరగబడిన సింధు జనం
  • గత రెండు వారాలుగా అట్టుడుకుతున్న సింధ్ ప్రాంతం
  • ప్రొవిన్షియల్ హొం మంత్రి ఇల్లు దగ్ధం చేసిన ఆందోళనాకారులు
  • నిరసనకారులపై కాల్పులు జరిపిన హోం మంత్రి
  • ఇద్దరి మృతి.. అనేక మందికి గాయాలు
  • సింధు జలాలను పంజాబ్ కు తరలిస్తున్న ప్రభుత్వం
  • పుష్కలంగా నీరు ఉన్నా ఇంకా అదే ఏరియాకు మళ్లింపు
  • సింధు రాష్ట్రంలో తాగు, సాగు నీరు లేక అల్లాడుతున్న జనం
  • నడి వేసవి రాకముందే జనం అవస్థలు..
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న అంశం

పాకిస్థాన్ లో అంతర్యుద్ధం రాజుకుంటోంది. ఇప్పటికే బెలూచిస్తాన్ విడిపోయి స్వతంత్రం ప్రకటించుకోగా, కెపికే ఖైబర్ ఫక్త్ ప్రావిన్సు కూడా ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఇప్పుడు సింధ్ కూడా అట్టుడుకుతుండటంతో పాక్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నీటికోసం సింధ్ ప్రాంతం అల్లాడుతోంది. వేసవి తీవ్రత అక్కడ ఇంకా పెరగకముందే జనం తాగు, సాగు నీటికోసం అల్లాడుతున్నారు. ఆగ్రహంతో సింధ్ ప్రాంత ప్రజలు, రైతులు, యువకులు అందరూ రోడ్డెక్కారు. సింధు జలాలను సంపన్న వర్గాలు అధికంగా ఉండే పాక్ పంజాబ్ ప్రాంతానికి కొత్తగా ఐదు కాల్వల ద్వారా తరలించాలని నిర్ణయించి,వాటి కోసం డ్యాములు కట్టే ప్రయత్నాలకు సింధు జనం అడ్డు తగులుతున్నారు. తాగు, సాగు నీటికి చుక్క నీరు లేక ఇప్పటికే అల్లాడుతున్నారు.

హోం మంత్రి ఇల్లు దగ్ధం

ఆగ్రహంతో ప్రొవిన్షియల్ హోం మంత్రి ఇంటిని తగుల బెట్టారు. రోడ్లపైకి కర్రలతో వచ్చి దారిన పోయే వాహనాలపై దాడులు చేశారు. రాళ్లు రువ్వారు. లూటీలకు పాల్పడ్డారు. పంజాబ్ రాష్ట్రానికి పుష్కలంగా సాగు నీరు, తాగు నీరు ఉన్నా ఇంకా సింధు జలాలను తరలించడం అన్యాయమని వారు మొత్తుకుంటున్నారు. పంజాబ్ లో పుష్కలంగా ఉన్న డ్యాంలలోకే సింధు జలాలను తరలించుకుపోతున్నారు. దానివల్ల సింధ్ ప్రాంతంలో కాల్వలు, నదులు ఎండిపోయాయి. తాగేందుకు చుక్క నీరు లేదు.. వ్యవసాయం కూడా సాధ్యపడే పరిస్థితి లేదు. అందుకే స్థానికులు తిరగబడ్డారు.ఫిరోజ్ పూర్ లోని నౌషెరాలో నీటి తరలింపు ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. దాంతో రగడ మొదలైంది. సింధ్ హోం మంత్రి ఆందోళనాకారులపై కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. సోషల్ మీడియా ఎక్స్ లో సింధ్ అల్లర్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పెహల్గాం దాడిలో 26మంది అమాయక హిందువులను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో భారత్ ప్రతిచర్యగా పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసింది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దాంతో పాక్ లో సింధ్ ప్రాంతం తాగు నీటికోసం అల్లాడుతోంది. పాక్ లోని పంజాబ్ రాష్ట్రానికి పుష్కలంగా జలవనరులు ఉన్నా, డ్యాంలన్నీ నీటితో కళకళలాడుతున్నా ఇంకా ఆ ప్రాంతానికే ఐదు కాల్వల ద్వారా నీటిని మళ్లిస్తుండటం సింధ్ ప్రాంత ప్రజల ఆగ్రహానికి కారణమైంది

Tags:    

Similar News