సింధు జలాల నీటిని అడ్డుకుంటే భారత ప్రజల ఊపిరి తీస్తాం...

తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ ఆర్మీ అధికారి;

Update: 2025-05-24 09:32 GMT

సరిహద్దు తీవ్రవాదం విషయంల భారత్... పాకిస్తాన్ ల మధ్య గంభీరమైన వాతావరణం నెలకొన్న తరుణంలో కూడా పాక్ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. బెదిరింపు ధోరణిలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా పాక్కు చెందిన ఓ ఆర్మీ అధికారి భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల నీటిని అడ్డుకుంటే భారత ప్రజల ఊపిరి తీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత -పాకిస్థాన్ దేశంతో చేసుకున్న సింధు జలాల ఒప్పందం అమలును దేశం నిలిపివేయాలని భారత్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తాజాగా మాట్లాడారు. పాక్లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాకు వచ్చే నీటిని భారత్ అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధూ నదిలో జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది... అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్ వ్యాఖ్యలకు అద్దం పడుతున్నాయి. మీరు నీటిని ఆపేస్తే.. మేము మీ శ్వాసను ఆపేస్తాం. ఆపై సింధు నదిలో రక్తం పారుతుంది' అని గతంలో హఫీజ్ సయీద్ సైతం ఇదే తరహా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే పాక్ ఆర్మీ అధికారి చేయడం గమనార్హం. మరోవైపు సింధూ నదీ వ్యవహారంలో భారత ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గట్టిగా బదులిస్తామని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ తన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నట్లు ఆయన ఖండించారు. సింధూ జలాలు మావే అని, అవి ఎప్పటికీ మా నీళ్లే అని, ఆ నదిలో మా నీళ్లు అయినా పారాలి లేక మీ రక్తమైనా పారాలని అని బిలావల్ కూడా బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యానించారు. మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీ అయినా, ఆ దేశ రాజకీయ నాయకులైన నరనరానా ఉగ్రవాద లక్షణాలతో మాట్లాడతారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం

Tags:    

Similar News