సిరియా రాజధాని డమాస్కస్ లో ఆత్మాహుతి దాడి
30మంది మృతి… 53 మందికి గాయాలు;
సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిన 30 మంది మృతి చెందారు. డమాస్కస్ నగర శివారుల్లో ఉన్న ఓ చర్చిలో ఆదివారం ఈ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. డమాస్కస్ నగరంలోని డ్వెయిల్ అనే చోట మార్ ఎలియాస్ అనే చర్చరిలో ఆదివారం కావడంతో పెద్దయెత్తున జనం చేసి ప్రార్ధనలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి చెందగా 53 మంది గాయపడినట్లు సమాచారం అందుతోంది. చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి జనం మధ్యకు చేరుకుని ముందుగా తుపాకీతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. కాల్పుల తరువాత పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఉన్న వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ మధ్యకాలంలో చర్చిలపై దాడులు జరగడం సిరియాలో ఇదే మొదటి సారి. బషర్ అస్సద్ పాలన సిరయాలో అంతమై అహ్మద్ అల్ షరా అధికారం చేపట్టి వ్యవస్ధలపై పట్టు సాధించే క్రమంలో ఈ దాడి జరగడం గమనార్హం. డమాస్కస్ శివారు చర్చిలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిని సిరియా సమాచార శాఖ మంత్రి హమ్జా ముస్తాఫా ఖండించారు. ఈ ఆత్మహుతి దాడి పిరికిబంద చర్యగా ఆయన అభివర్ణించారు.