nald Trump:ట్రంప్‌ సుంకాల బెదిరింపు .. ఈయూ దేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు

ఈయూ దేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు

Update: 2026-01-22 04:27 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో యూరోపియన్ దేశాలపై విధించబోయే సుంకాల (టారిఫ్‌లు) బెదిరింపును వెనక్కి తీసుకున్నారు. దావోస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.

US President Donald Trump: గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ ఆకాంక్షలకు మద్దతు ఇవ్వని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని గతంలో ఆయన బెదిరించారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ సుంకాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన సమావేశం చాలా ఫలప్రదంగా ఉందని, గ్రీన్‌లాండ్ మరియు ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తుపై ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించామని ట్రంప్ తెలిపారు. ఈ అవగాహన ఆధారంగా సుంకాలను విధించడం లేదని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నాటో మిత్రదేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

గ్రీన్‌లాండ్‌లో ‘గోల్డెన్ డోమ్’ నిర్మాణంపై చర్చలు కొనసాగుతున్నాయని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లు ఈ విషయంలో చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు.

ఈ నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్సే లోకే రాస్ముసెన్ స్వాగతించారు. ఇది చాలా సానుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్ స్వాధీనం విషయంలో బలప్రయోగం చేయబోమని దావోస్ వేదికగా చెప్పిన ఆయన.. తాజాగా సుంకాల బెదిరింపుపై వెనక్కి తగ్గారు.

Tags:    

Similar News