200 అడుగుల లోతు లోయలో పడ్డ బస్సు
ఇద్దరు మృతి... ఇరవై మందికి గాయాలు;
హిమాచల్ రాష్ట్రంలోని మండి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరవై నుంచి ఇరవైఐదు మంది ప్రయాణికులు ఉన్న బస్సు మండి జిల్లాలో అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమచారం. రెస్క్యూ బృందాలు సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతలో ఈ ప్రమాదం సంభవించగా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తక్షణం పోలీసుల ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు మండి పోలీసులు చెపుతున్నారు.