చీనాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

కత్రా-శ్రీనగర్ వందే భారత్ రైలు కూడా;

Update: 2025-06-06 11:20 GMT

లెఫ్టినెంట్ గవర్నర్‌ కు పదోన్నతి రాగా తాను మాత్రం డిమోట్‌ అయ్యానని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ చీనాబ్ వంతెనతో పాటు కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓమర్‌ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాన్ని ప్రధాని వద్ద మరోసారి లేవనెత్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లోని అన్ని రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధానితో అనుబంధం కలిగి ఉండటం తన అదృష్టమని అన్నారు. అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తాను ప్రధానితో పాటు పాల్గొన్నట్లు ఒమర్‌ అబ్దుల్లా ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. 2014లో కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నారని అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి పొందారనా తాను మాత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా తగ్గిపోయానని వాపోయారు. కానీ మనకు తెలియకముందే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తారు' అని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను మోదీ ముందు ఓమర్‌ అబ్దుల్లా ఈరకంగా ప్రస్తావించారు.

Tags:    

Similar News