కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న "ద ట్రైటర్స్" రియాలిటీ షో ప్రారంభమైన మూడో ఎపిసోడ్‌తోనే మంచి టాక్‌ సంపాదించుకుంది.ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వ్యక్తి రాజ్ కుంద్రా. అతని అమాయకత్వం, నిజాయితీ, వ్యక్తిత్వం ప్రేక్షకుల మనసులను దోచేశాయి. కానీ, ఆటలోంచి ఆయన నిష్క్రమించాల్సి వచ్చింది.



ఈ షోలో విశ్వాసం, మోసం, బతికే పోరాటం, నిజమైన ట్రైటర్‌ను గుర్తించే రీతిపై ఆధారంగా గేమ్ నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా ఎలాంటి మైండ్ గేమ్స్ లేకుండా, పూర్ణంగా నిజాయితీతో వ్యవహరించారు. రెండో ఎపిసోడ్‌లో ట్రైటర్‌గా గుర్తించబడిన తర్వాత, షో నుంచి బయటకు వెళ్లే సందర్భంలో ఆయన మాట్లాడుతూ, “నిజం చెప్పగలగడం నా సహజ స్వభావం. నాకు నా జీవితాన్ని రక్షించుకోవడానికి కూడా అబద్ధం చెప్పడం రాదు. నా భార్య చెప్పింది నిజమే. నేను మోసం చేయడం ఎప్పుడూ చేయలేను,” అన్నారు.



“ద ట్రైటర్స్‌కి నేను వచ్చినది హృదయాలను గెలవడానికి, స్నేహితులను సంపాదించడానికి. ఆట నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో కూడా నేను నా అసలైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. షోలో ఉన్న అన్ని పార్టిసిపెంట్లకు నా శుభాకాంక్షలు,” అని రాజ్ కుంద్రా మనసుపూర్వకంగా తెలిపారు.



ఆటలో పాల్గొన్న సమయంలో ఆయన శారీరక పరీక్షలే కాదు, మేధస్సు అవసరమైన ఆటల్లోనూ తనవైపు నుండి పూర్తి కృషిని చేశాడు. మిగతా ఆటగాళ్ల మధ్య మోసాలు, వ్యూహాలు జరుగుతున్నా… రాజ్ కుంద్రా మృదుస్వభావంతో, ఉదారంగా మెలగడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆటను గెలవలేకపోయినా… ప్రేక్షకుల మనసులను మాత్రం ఆయన గెలుచుకున్నారు.



ఈ సీజన్‌లో రాజ్‌తో పాటు కరణ్ కుంద్రా, అంషులా కపూర్, అషిష్ విద్యార్థి, ఎల్నాజ్ నోరుజీ, హర్ష్ గుజ్రాల్, జన్నత్ జుబైర్, జన్వీ గౌర్, అపూర్వ ముఖిజా (ది రేబెల్ కిడ్), జాస్మిన్ భాసిన్, లక్ష్మీ మంచు, మహీప్ కపూర్, ముకేశ్ ఛబ్రా, నికితా లూథర్, పూరవ్ ఝా, రఫ్తార్, ఊర్ఫీ జావేద్, సహిల్ సలాథియా, సుధాంశు పాండే, సుఫీ మోతీవాలా వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.



తీవ్ర ఉత్కంఠను కలిగించే షోగా "ద ట్రైటర్స్" సాగుతుండగా... రాజ్ కుంద్రా మాత్రం తన అమాయకత్వంతో అందరి మన్ననలు పొందారు.


Tags: