రూ.500 కరెన్సీ నోట్లు వచ్చే ఏడాది రద్దవుతాయా?

Update: 2025-06-07 12:31 GMT
  • 2026లో ఐదు వందల నోట్లు రద్దవుతాయని వార్తలు
  • సంచలనం రేపిన వీడియో కథనం
  • 12నిమిషాల నిడివితో కేపిటల్ టీవీ కథనం
  • ప్రజల్లో భయాందోళనలు, అయోమయం
  • ఇప్పటికే 5 లక్షల వ్యూస్ సాధించిన వీడియో
  • రంగంలోకి దిగిన కేంద్రం
  • అది తప్పుడ కథనమని తేల్చిన వైనం
  • పీఐబీ అధికారిక ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ ఖాతాలో వివరణ
  • డీ బంక్ చేస్తూ మిసిన్ఫర్మేషన్ అని స్పష్టీకరణ

ఐదొందల నోట్లు వచ్చే ఏడాదినుంచి రద్దవుతాయా? 500 రూపాయల నోట్లు వచ్చే ఏడాది మార్చి నుంచి రద్దు చేయబోతున్నారంటూ ఓ యూట్యూబ్ వీడియో సంచలన కథనం వైరల్ గా మారింది.ఈనెల 2న కేపిటల్ టీవి అనే యూట్యూబ్ ఛానలె్ మరో ఏడాదిలో ఐదొందల నోట్లను రద్దు చేయబోతున్నారంటూ ఓ 12 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఎయిర్ చేసింది. డీమానిటైజేషన్ కష్టాలు ఇప్పటికీ గుర్తున్న వారంతా ఈ కథనాన్ని ఆసక్తిగా చూశారు.ఆ వీడియోకి ఇప్పటికే 5 లక్షల వ్యూస్ వచ్చాయి. వీడియో వైరల్ గా మారడం,ప్రజల్లో అయోమయం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే కేంద్రం వివరణ ఇచ్చింది.

కేంద్రం ఏం చెబుతోంది?

వైరల్ గా మారిన ఈవీడియో కథనాన్ని కేంద్రం కొట్టి పారేసింది. రిజర్వు బ్యాంకు ఇప్పటి దాకా అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని ప్రజలెవరూ ఈ తప్పుడు కథనాలను నమ్మవద్దని కోరింది. ఇది ప్రజల్లో అయోమయాన్ని, భయాందోళనలను పెంచుతుందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ వైరల్ వీడియోని డీ బంక్ చేస్తూ ప్రభుత్వ అధికారక వెబ్ సైట్ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ను పోస్ట్ చేసింది.ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ ఆ కథనాన్ని ఫేక్ అని స్పష్టంగా డీబంక్ చేసింది.ఇలాంటి మిస్ ఇన్ఫర్మేషన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.ఇలాంటి వార్తలను వెరిఫై చేసుకోకుండా ఫార్వర్డ్ చేయవద్దని కోరింది.

గతంలో ప్రధాని మోడీ దేశంలో అవినీతి, నల్లధనం అరికట్టడానికి 2016 నవంబర్ 8న ఐదువందల కరెన్సీ నోట్లను గతంలో రద్దు చేశారు.అప్పటికి మార్కెట్ లో ఉన్న నోట్లన్నింటినీ వెనక్కు తీసేసి రెండురోజుల్లో కొత్త నోట్లను సర్క్యులేషన్ లోకి తెచ్చారు. డీ మానిటైజేషన్ సమయంలో ప్రభుత్వం రెండువేల రూపాయల కరెన్సీ కొత్త నోట్లను విడుదల చేసింది. పాత రెండువేల కరెన్సీ నోటును 2023 మేలో చెలామణీ నుంచి తప్పించారు. అయినప్పటికీ ఎక్కడైనా మిగిలిపోతే అవి అధికారికంగా చెల్లుబాటు అయ్యే వెసులుబాటు కల్పించారు.

Tags:    

Similar News