స్పెయిన్ లో నిలిచిపోయిన మెబైల్ నెట్ వర్స్క్
People are facing difficulties as mobile services are down in Spain;
అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకునే యూరొప్ లో పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ దేశాలను ఏలిన రాజ్యాల్లో ప్రజలు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ నెల చివర్లో ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లలో అంధకారం అలుముకుంది. విద్యుత్త సరఫరా నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా దేశాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ప్రపంచం నివ్వెరపోయింది.
తాజాగా స్పెయిన్ లో మొబైల్ నెట్ వర్క్ లు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. డౌన్డిటెక్టర్ ప్రకారం.. స్పానిష్ టెలికాం దిగ్గజం టెలిఫోనికాతో పాటు స్పెయిన్లోని అన్ని ప్రధాన నెట్వర్క్లు సడెన్గా ఆగిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ కాల్స్, టెక్ట్స్ను చేయలేకపోతున్నారు. టెలిఫోనికా నిర్వహిస్తున్న నెట్వర్క్ అప్గ్రేడ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడి ఉండొచ్చని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మోవిస్టార్, ఆరెంజ్, వోడాఫోన్ వంటి ఇతర మొబైల్ నెట్వర్క్స్ నిలిచిపోయాయి. వినియోగదారులు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్స్తోపాటు జాతీయ అత్యవసర నంబర్ ‘112’ కూడా ప్రభావితమైనట్లు స్పానిష్ మీడియా పేర్కొంటోంది. తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు స్పెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు వారాల క్రితం స్పెయిన్లో అంధకారం అలముకోగా... ఇప్పుడు మొబైల్ నెట్వర్క్స్ ఆగిపోవడంతో ఐరోపా దేశంలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గత నెల చివర్లో ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజా రవాణా స్తంభించి భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. దవాఖానల్లో సర్జరీలు ఆగిపోయాయి. మెట్రో రైళ్లలో ప్రయాణికులు చిక్కుబడిపోగా, నిలిచిపోయిన లిఫ్టులలోనుంచి బయటపడలేక చాలామంది అందులోనే ఉండిపోయి ఇబ్బందులు పడ్డారు. ఐరోపాలో గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వెనుక సైబర్దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్పెయిన్, పోర్చుగల్లోని ప్రధాన నగరాలను కలిపే యూరప్లోని పవర్ గ్రిడ్పై సైబర్ దాడి జరిగి ఉండవచ్చని స్పెయిన్, పోర్చుగల్లోని పవర్ గ్రిడ్ అపరేటర్లు చెపుతున్నారు.