Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: గులాబీ పార్టీ చిరునామా మార్పు- మంత్రి పొన్నం
గులాబీ పార్టీ చిరునామా మార్పు- మంత్రి పొన్నం
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గూబ గుయ్యిమనేట్లు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా చిరునామా గల్లంతవుతుందని జోస్యం చేశారు. ముఖ్యంగా, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్లో ఏ అభివృద్ధి జరిగిందో ప్రజలు చర్చించి, తీర్పు వేయాలని సవాల్ విసిరారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ, "అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చి, బుద్ధి చెప్పారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కూడా ఆ పార్టీకి తగిన పాఠం చెప్పారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు (ఫేక్ వోట్లు) నమోదు చేసుకోవడానికి బీఆర్ఎస్, భాజపా కలిసి కుట్ర పన్నుతున్నారు. మాగంటి సునీతతో కన్నీరు పెట్టించి, గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది" అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ ఉపఎన్నిక ప్రజలు పార్టీల అవినీతి, అణచివేతలకు వ్యతిరేకంగా ఓటు వేసి, నిజమైన మార్పుకు మద్దతు చూపాల్సిన అవకాశమని పొన్నం పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం పెరగడం వంటి అంశాలను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.