ఇరాన్‌పై జీబీయూ-57 బాంబులతో అమెరికా భారీ ఆపరేషన్‌కు సిద్ధం?

Is America preparing for a major operation against Iran with GBU-57 bombs?;

Update: 2025-06-17 10:59 GMT

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా సిద్ధమవుతోందని అంతర్జాతీయంగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా అత్యంత ప్రమాదకరమైన ‘జీబీయూ-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్’ బాంబులను వినియోగించనున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



జీ-7 సమావేశాల మధ్యలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్థంతరంగా తిరిగి వెళ్లిపోవడం, టెహ్రాన్ ప్రజలు నగరాన్ని వీడి వెళ్లిపోవాలంటూ.. ఆ వెంటనే హెచ్చరికలు చేయడం, ఆయన తిరిగి వాషింగ్టన్‌లో ‘సిచ్యుయేషన్ రూమ్’ను సిద్ధం చేయించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి.



ఫార్దో అణు కేంద్రం లక్ష్యంగా మారుతుందా?


ఇరాన్‌లోని ఫార్దో అణు కేంద్రం భూగర్భంలో, పర్వతాల మధ్య అత్యంత బలమైన రక్షణతో నిర్మించారు. అక్కడ 60 శాతానికి పైగా యురేనియం శుద్ధి సామర్థ్యం ఉండటం, గతంలో 83.7% శుద్ధి చేసిన ఆనవాళ్లు ఉండటం అమెరికా, ఇజ్రాయెల్‌లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇది అణుబాంబు తయారీలో కీలక దశ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



ఇలాంటి స్థావరాలను నాశనం చేయటానికి సాధారణ బాంబులు సరిపోవు. అందుకే జీబీయూ-57 బాంబుల వాడకంపై చర్చలు మొదలయ్యాయి. ఈ బాంబు దాదాపు 13.6 టన్నుల బరువుతో బంకర్లలోకి చొచ్చుకుపోయి ధ్వంసం చేయగల శక్తి ఈ బాంబులకే ఉంది. దీనిని కేవలం బి-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే మోసుకెళ్లగలుగుతాయి.



పశ్చిమాసియాలో మళ్లీ అస్త్ర శస్త్రాల అరాచకం?


అమెరికా ఇప్పటికే తన యుద్ధ నౌక యూఎస్‌ఎస్ నిమిట్జ్‌తోపాటు, ఫైటర్ విమానాలను పశ్చిమాసియా సమీపంలో మోహరించినట్లు సమాచారం. బ్రిటన్ కూడా తన యుద్ధ విమానాలను మోసగించటం మొదలుపెట్టింది. ఈ చర్యలన్నీ పశ్చిమాసియాలో మరో సైనిక ఘర్షణకు దారితీయవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.





Tags:    

Similar News