పొల్యూషన్ టాప్-10లో భారత్లోనే ఆరు నగరాలు
Six cities in India are among the top 10 cities in terms of pollution;
భారత్ మరో రికార్డు నెలకొల్పింది. అయితే, మంచి విషయంలో కాదు.. అత్యంత కాలుష్యకారక నగరాల లిస్టులో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక నగారాల జాబితాలో టాప్ ఫైవ్లో మూడు నగరాలు, అదే టాప్ టెన్లో ఆరు నగరాలు భారత్లోనే ఉన్నాయి. ఇది తీవ్రంగా కలకలం రేపుతోంది.
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా అందరూ భావిస్తోన్న ఢిల్లీ నగరం కాలుష్య కారక నగరాల లిస్టులో సెకండ్ ప్లేస్లోకి చేరింది. అయితే, ఫస్ట్ ప్లేస్ కూడా భారత్కే దక్కింది. మేఘాలయలోని బైర్నిహాట్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా.. కజకిస్థాన్ దేశం లోని కరగండా నగరం మూడో స్థానంలో ఉంది. ఇక, మన భారత దేశంలోనే ఉన్న పంజాబ్లోని ముల్లాన్ పూర్ నాలుగో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్లోని లాహోర్ ఐదో స్థానం సంపాదించింది.
గతేడాదికి సంబంధించిన కాలుష్య కారక నగరాల జాబితా ఇది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ 2024 వార్షిక కాలుష్య నివేదిక ప్రకారం.. మేఘాలయలోని బైర్నిహాట్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణంగా నిలిచింది. ఢిల్లీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా బైర్నిహాట్ను వరుసగా రెండవ సంవత్సరం భారతదేశంలో అత్యంత కలుషితమైన పట్టణ ప్రాంతంగా ప్రకటించింది. ఎయిర్ క్వాలిటీఇండెక్స్ (ఎక్యూఐ) 302తో, దీనిని "అత్యంత పేలవమైన" కేటగిరీలో చేర్చింది. తరచూ ఢిల్లీ నగరం అత్యంత కాలుష్య కారకమైన నగరంగా చెప్పుకుంటున్నప్పటికీ.. ఢిల్లీ నగరం రెండో స్థానానికి చేరుకుంది. తరువాత కజకిస్తాన్లోని కరగండ కాలుష్య నగరాల జాబితాలో మూడవ స్థానంలో చేరింది. భారతదేశంలోని పంజాబ్లో ఉన్న ముల్లాన్ పూర్ నాల్గవ స్థానంలో, పాకిస్తాన్ లోని లాహోర్ ఐదవ స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ఆరో స్థానంలో, చాద్ లోని నజామెనా ఏడో స్థానంలో, భారత్ లోని ఉత్తరప్రదేశ్లో ఉన్న లోని పట్టణం ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో, హర్యానాలోని ఫరీదాబాద్ 10వ స్థానంలో నిలిచాయి.2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో పాకిస్థాన్ లోని ముల్తాన్ 11వ స్థానంలో, పెషావర్ 12వ స్థానంలో, ఫైసలాబాద్ 13వ స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ లోని సియాల్ కోట్ 14వ స్థానంలో ఉంది. హర్యానాలోని గురుగ్రామ్, రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ వరుసగా 15, 16 స్థానాల్లో నిలిచాయి. చైనాలోని హోతాన్ 17వ స్థానంలో నిలవగా, ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, రాజస్థాన్లోని భివాడి 18, 19 స్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ 20వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ 21వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ లోని నోయిడా 22వ స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ లోని పిండి భటియన్ 23వ స్థానంలో, హర్యానాలోని బల్లాబ్ గఢ్, పంజాబ్లోని మండి గోవింద్ గఢ్ వరుసగా 24, 25 స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 26వ స్థానంలో, హర్యానాలోని బహదూర్ గఢ్ 27వ స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ లోని శ్రీపూర్ 28వ స్థానంలో, పాకిస్థాన్ లోని చార్సద్దా 29వ స్థానంలో నిలిచాయి.