Minister Parthasarathy: రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని అభివృద్ధి చేస్తున్నందుకు వైకాపా నేతలు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క విష ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

“మీ దృష్టిలో రాష్ట్రాన్ని నిలబెట్టేవారు విలన్‌లా? రాష్ట్రాన్ని కూల్చేవారు హీరోలా?” అని సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీస్తూ మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు విలన్ ఎలా అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతిపై చేసిన అవాకులు, చెవాకులు పూర్తిగా హాస్యాస్పదమని మంత్రి అన్నారు. “మీరు చెప్పే మావిగన్‌లో గుంటూరు ఉంది. అమరావతి కూడా గుంటూరు పరిధిలోనే ఉందని మరచిపోయారా?” అని ఎద్దేవా చేశారు.

అమరావతిపై పూటకో మాట, నిమిషానికొక విష ప్రచారం చేస్తున్న వైకాపా నేతల కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా ఫలించవని స్పష్టం చేశారు. “రాష్ట్రమంతా అమరావతితోనే. అమరావతి అజేయం.. అమరావతే శాశ్వతం” అని మంత్రి పార్థసారథి ధీర్ఘంగా ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వైకాపా నేతలు వ్యతిరేకిస్తున్న వైఖరిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story