AP CM Chandrababu: క్వాంటమ్ టెక్నాలజీపై ఫోకస్ పెంచుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఫోకస్ పెంచుతున్న ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: సంకల్పం ఉంటే ఎన్నో గొప్ప పనులు సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో జరిగిన 28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ, "సరైన సమయంలో ప్రధాని మోదీ సరైన నాయకుడిగా వచ్చారు. ఆయన ప్రజలకు ప్రయోజనకరమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. సాంకేతికతకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి.
ఐటీ రంగంలో భారతీయులు అసాధారణ నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల హైదరాబాద్ ఐటీ హబ్గా అభివృద్ధి చెందింది, తద్వారా తెలంగాణ తలసరి ఆదాయంలో ముందంజలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థల్లో పనిచేసే భారతీయుల్లో సుమారు 30 శాతం ఆంధ్రప్రదేశ్ వాసులే. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడు, అందులో ఒకరు ఏపీ నుంచి ఉండటం విశేషం. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నాం" అని చంద్రబాబు తెలిపారు.
