మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించడంతో కాకానిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అక్రమ మైనింగ్ వ్యవహారం లో కేసు ఎదుర్కొంటున్న కాకాణి నీ పోలీసులు ఆదివారం బెంగుళూరు లో అరెస్ట్ చేసారు. సోమవారం ఉదయం జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలు మధ్య మాజీ మంత్రి కాకాని ని వెంకటగిరి తరలించారు. పొదలకూరు మండలం తాటిపర్తితో రుస్తుం మైన్స్ అక్రమంగా మైనింగ్ చేసిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్ ఛార్జ్ డీడీ బాలజీ నాయక్ పొందలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని ఆయన వారికి సహకించారంటూ 1209బి), 447, 427,379, 290, 506, 109 రెండ్ విత్ 34 ఐఎఎస్, సెక్షన్ 3పీడీపీపీఏ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ4గా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో బలం లేదని గతంలో ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసులో మరింత బలమై సెక్షన్లను నమోదు చేశారు పోలీసులు. కాగా ఆదివారం కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను నెల్లూరు డీటీసీకి తరలించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story