5 కేటగిరీ బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం

స్త్రీ శక్తి పేరుతో ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు. తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్‌ స్టాప్‌, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, స్టార్‌ లైనర్‌, ఏసీ బస్సులకు ఈ ఉచిత ప్రయాణ పథకం వర్తించదు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story