పిచ్చి వేషాలు వేసతే తొక్కి నారతీస్తాం – పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తాను నిస్వార్ధంగా ముందుకు వచ్చానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు సదస్సులో డిప్యూటీ సీయం మాట్లాడుతూ గత ప్రభుత్వం విధ్వంసకరంగా వ్యవహరించిందని, మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకపోతే ఏపీ ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. ఇప్పుడే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నామన్నారు. సామాజిక పించన్లకు గత ప్రభుత్వంలో రూ.1930 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వంలో రూ.2717 ఖర్చుచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 216 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. దీపం పధకం కోసం ఐదేళ్ళలో రూ.13,423 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పధకాలకు ఆయన పేర్లు పెట్టుకున్నారని, ఇప్పుడు సమాజానికి ప్రేరణగా ఉన్న వారి పేర్లు పెట్టడంపై నారా లోకేష్ ని డిప్యూటీ సీయం అభినందించారు. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి చంద్రబాబు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా రౌడీయిజం మారలేదన్నారు. కూటమి ప్రభుత్వం అసాంఘిక చర్యలను సహించదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బెదిరింపులకు, తాటాక చప్పుళ్ళకు భయపడమన్నారు. ఐక్యత చెడగొట్టే పరిస్ధితుల్లో తాను లేనని స్పష్టం చేశారు. రోడు మీదకు వచ్చి గొంతులు కోస్తాం అని చెప్పటానికి బావుంటాయని, మాది మంచి ప్రభత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం గుర్తుపెట్టుకోమని డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
