In governance, in leadership.. Nara Lokesh 2.O

నారాలోకేష్‌.. ఓ వ్యక్తి కాదు.. ఇప్పుడో పరిపక్వ నాయకుడు. అవును.. సొంత పార్టీ నేతలే కాదు.. విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్న మాట ఇది. ఇప్పటి నారా లోకేష్‌ను చూస్తే ఆయనో శక్తిగా మారారని ప్రత్యర్థులే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఒకప్పుడు రాజకీయ అనుభవం లేదు, వాక్చాతుర్యం లేదు.. పప్పు అంటూ.. విమర్శల పాలైన నారా లోకేష్, ఇప్పుడు తనదైన రాజకీయ పటిమతో విపక్షాలను కూడా విస్తుపోయేలా చేస్తున్నారు.

తండ్రి చంద్రబాబు నాయుడు నుంచి అపార రాజకీయ అనుభవం ప్రేరణ తీసుకున్నప్పటికీ, లోకేష్ తనదైన శైలితో ప్రస్థానం కొనసాగిస్తున్నారు. గతంలో ‘లోకేష్ 1.0’గా ఉండగా, ఇప్పుడు ‘లోకేష్‌ 2.0’గా పరిణతి చెందుతూ ఎదిగారన్న చర్చ నడుస్తోంది. పాలనలో సాంకేతికతను వినియోగిస్తూ, "వాట్సాప్ గవర్నెన్స్" లాంటి వినూత్న ఆలోచనలతో ప్రజలకు దగ్గరయ్యారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్, పాలనా విషయాల్లో పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నారు. ఆయన ప్రసంగాలు స్పష్టంగా, ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తూ, తెలుగుదేశం భవిష్యత్తును నడిపించే నాయకుడిగా ఎదుగుతున్నారు.

అంతేకాదు.. బీజేపీ వంటి జాతీయ పార్టీలు సైతం లోకేష్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలపై విమర్శలు వచ్చినా, అదే నాయకుడు ఇప్పుడు ప్రధాని మోదీ ప్రత్యేక విందుకు ఆహ్వానించబడిన స్థాయికి చేరుకున్నాడు. మొత్తానికి చెప్పుకోవాలంటే.. నారా లోకేష్ తెలుగుదేశం భావి నాయకుడు మాత్రమే కాదు, సమన్వయం, శ్రమ, పాలనలో స్పష్టతతో పునఃప్రతిష్ఠించుకుంటున్న రాజకీయ నాయకుడిగా వెలుగుతున్నారు. ప్రస్తుతం ఆయన గెలుపు కేవలం ఓటమి నుంచి కాదు – విశ్వాసం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయిన సందర్భంగా లోకేష్‌.. తనదైన ప్రత్యేక శైలిని పాలనలోనూ, పార్టీ నాయకత్వంలోనూ చూపిస్తున్నారు.



Politent News Web4

Politent News Web4

Next Story