రైతులకు పరిహారాలు ఇవ్వకపోవడం దారుణం!

Jagan Fires: మొంథా తుఫాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించిన విపత్తు మాత్రమేనని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో ఉచిత పంట బీమా పథకాన్ని గొప్పగా అమలు చేసినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గత 16 నెలల్లో రాష్ట్రాన్ని 16 తుఫాన్లు తాకినప్పటికీ, ఒక్క రైతుకూ పంట నష్ట పరిహారం చెల్లించలేదని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్, ప్రభుత్వం అరకొర లెక్కలతో రూ.600 కోట్ల పరిహారాలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ హామీలు అందుకోలేదని జగన్ స్పష్టం చేశారు. మిర్చి క్వింటాల్ రూ.11,781కు, మామిడి కిలో రూ.12కు, ఉల్లి క్వింటాల్ రూ.1,900కు కొనుగోలు చేస్తామని చంద్రబాబు చెప్పి మాట మార్చారని ఆరోపించారు. "ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. తుఫాన్లు పెరగడానికి కారణం పరిపాలనా వైఫల్యాలే" అంటూ జగన్ వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

మెడికల్ కాలేజీల అంశంపై రైల్ రోకో నిరసనను నవంబర్ 4 నుంచి 11 తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు జగన్ తెలిపారు. జిల్లాల పర్యటనలపై పార్టీ నేతలు ప్రశ్నించగా, పంట నష్టం అంచనా పూర్తయి పరిహారాలు చెల్లించిన తర్వాత పరిస్థితులను బట్టి వస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తుఫాను బాధితుల సహాయం, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story