నెల్లూరు జైలుకు తరలింపు

Jogi Ramesh: నకిలీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేశ్‌ మరియు ఆయన సోదరుడు రామును కోర్టు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌కు పంపిన నేపథ్యంలో, వారిని విజయవాడ జైలు నుంచి నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తూర్పు ఎక్సైజ్‌ విభాగం కార్యాలయంలో సిట్‌ అధికారులు జోగి రమేశ్‌ను దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఆయన సోదరుడు రాముతో కలిపి, వేర్వేరుగా ప్రశ్నలు వేశారు. ఈ కేసులో ముఖ్య నిందితుడు జనార్దనరావుతో ఆయన సంబంధాలపై లోతుగా ఆరా తీశారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అర్ధరాత్రి తర్వాత వాదనలు మొదలై, తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి రిమాండ్‌ ఆదేశాలు జారీ చేశారు. మొదట వారిని విజయవాడ జైలుకు తీసుకెళ్లారు. తాజాగా అక్కడి నుంచి నెల్లూరు జైలుకు బదిలీ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story