Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియామకం
జస్టిస్ లీసా గిల్ నియామకం

Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియమించింది. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యి న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం, 2026 ఏప్రిల్ 25 నుంచి జస్టిస్ లీసా గిల్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించనున్నారు. ఇది న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతోంది.

