ఫీజు రీయింబర్స్మెంట్పై కీలక అప్డేట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలకు సంబంధించి సర్వే ప్రారంభించింది. ఇప్పటికే ఫీజులు చెల్లించిన వారికి వాళ్ల బ్యాంకు అకౌంట్లలో రీ ఇంబర్స్మెంట్ జమ చేయనుంది. ఫీజులు కట్టనివాళ్లకు సంబంధించి వాళ్లు చదువుతున్న కాలేజీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై సర్వే చేపడుతోంది. కాలేజీల్లో ఆల్రెడీ ఫీజు బకాయిలు చెల్లించిన వారు, చెల్లించని వాళ్లు అందరూ కూడా తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ బయోమెట్రిక్ థంబ్ వేయాల్సి ఉంటుంది. ఫీజు ఇప్పటికే చెల్లిస్తే ఆ రశీదులను సచివాలయాల్లో సబ్మిట్ చేయాలి. 2023-24 విద్యాసంవత్సరంలో ఒక టర్మ్ ఫీజు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన టర్మ్ల ఫీజులు విడుదల చేయాల్సి ఉంది.
ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. 2023-24 విద్యాసంవత్సరం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. విద్యార్థుల బకాయిల సమస్యను పరిష్కరించేందుకు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి కాలేజీలకు ఫీజు చెల్లించిన వారికి నగదు తిరిగి అందించేందుకు సర్వే చేపట్టింది. గతంలో విద్యార్థులు కాలేజీలకు ఫీజు చెల్లించినప్పటికీ తమకు ఇంకా రీయింబర్స్మెంట్ రాలేదని చాలామంది చెబుతున్నారు. దీంతో గతంలో ఫీజు చెల్లించిన వారికి ఆ డబ్బులను నేరుగా విద్యార్థి తల్లి లేదా జాయింట్ అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఒకవేళ.. ఇప్పటికీ ఫీజు చెల్లించకపోతే.. ఆ బకాయిలను కాలేజీ అకౌంట్లలో, ఫీజు చెల్లిస్తే ఆ నగదును విద్యార్థుల లేదా వారి తల్లి దండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు.ఇందుకోసం జ్ఞానభూమి యాప్లో ఓ ప్రత్యేక ఆప్షన్ను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో పాటు.. సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కూడా వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థులు లేదా వారి తల్లులు గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించి ఫీజు చెల్లింపు రశీదులు ఉంటే సమర్పించి బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి. అక్కడ సిబ్బంది లాగిన్లో వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాలు సమర్పించిన తర్వాత విద్యార్థి లేదా వారి తల్లి బయోమెట్రిక్ వేసి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఫీజు రశీదులు లేకపోతే కాలేజీలను సంప్రదించి నకిలీ కాపీలు పొందవచ్చు. రీయింబర్స్మెంట్ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం బకాయిలను విడుదల చేయనుంది.
