• గ‌తంలో కేటాయించిన 4 సంస్థ‌ల‌కు కేటాయింపుల్లో మార్పులు
  • రెండు సంస్థ‌ల‌కు కేటాయింపులు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం
  • ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 74 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు పూర్తి
  • మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ వెళ్ళడి

మూడు రాజ‌ధానుల దెబ్బ‌కు అమ‌రావ‌తి అంటే కొన్ని సంస్థ‌లు భ‌య‌ప‌డి వెళ్లిపోయాయ‌ని మంత్రి పొంగూరు నారాయ‌ణ వెల్లడించారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై నియమించిన మంత్రివర్గ ఉపసఘం సోమవారం సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ భేటీ అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గ‌తంలో భూకేటాయింపులు చేసిన సంస్థ‌లు ఇప్పుడు స‌రిగా స్పందించ‌డం లేద‌ని చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలో కొత్త‌గా 10 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు చేస్తూ మంత్రివ‌ర్గ ఉపసంఘం నిర్ణ‌యం తీసుకుందని తెలిపారు. ఇందులో నాలుగు సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయ‌గా, కొత్త‌గా ఆరు సంస్థ‌ల‌కు స‌బ్ క‌మిటీ భూ కేటాయింపులు చేసిందని మంత్రి వివరించారు. అయితే గ‌తంలో కేటాయించిన రెండు సంస్థ‌ల‌కు భూముల కేటాయింపులు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుందన్నామని చెప్పారు. రాజధాని భూ కేటాయింపుల సబ్‌ కమిటీ 18వ సమావేశంలో మొత్తం 16 అంశాలకు గాను 12 అంశాలకు సబ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. సీబీఐకు రెండు ఎకరాలు అలాగే జియలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు,స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు,ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయింపుల‌ను కొన‌సాగిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపామన్నారు. అలాగే 2014- 19లో గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బ‌త్తి సంస్థ‌కు చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ కేబినెట్ స‌బ్ క‌మిటీ నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు.

ఈరోజు కొత్తగా మ‌రో ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేసిన‌ట్లు మంత్రి చెప్పారు... ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు,ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు,ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB) కి 0.5 ఎకరాలు,బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు,బీజేపీ కార్యాల‌యానికి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం...2014-19 మ‌ధ్య కాలంలో 130 సంస్థ‌ల‌కు 1270 ఎక‌రాలు కేటాయించ‌గా గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం,మూడు ముక్క‌లాట‌తో ప‌లు సంస్థ‌లు భ‌య‌ప‌డి వెన‌క్కి వెళ్లిపోయాయి...ఆయా సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి తిరిగి కేటాయింపుల విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటున్నాం...ఇప్ప‌టివ‌ర‌కూ 64 సంస్థ‌ల‌కు 884 ఎక‌రాలు కేటాయించ‌గా ఈరోజు మ‌రో ప‌ది సంస్థ‌ల‌కు కేటాయింపులు పూర్తి చేసామ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌...భూకేటాయింపులు చేసిన సంస్థ‌లు వీలైనంత త్వ‌ర‌గా నిర్మాణాలు ప్రారంభిస్తాయ‌న్నారు...అమ‌రావ‌తిలో ఇప్ప‌టికే ప‌దివేల‌కు పైగా కార్మికులు పుల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌న్నారు...వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టేనాటికి మొత్తం 20వేల మంది కార్మికుల‌తో ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతాయ‌ని మంత్రి నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం సమావేశానికి మంత్రులు నారాయ‌ణ‌,టీజీ భ‌ర‌త్ హాజ‌ర‌య్యారు...మంత్రులు ప‌య్యావుల కేశవ్,దుర్గేష్ లు ఆన్ లైన్ ద్వారా హాజ‌ర‌య్యారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత మంత్రి నారాయ‌ణ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు

Politent News Web 1

Politent News Web 1

Next Story