రాష్ట్రంలో విలువైన భూములు అన్నింటినీ తెలుగుదేశం పార్టీ నేతల దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ వారికి కారు చౌకగా భూములు ఇచ్చుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు దేవాలయాల భూములపై పడ్డారని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ భూములు కూడా తమకు ఇష్టమొచ్చిన వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారని ఇప్పటికే లీజుల పేరుతో తమ మద్దతుదారుల చేతిలో ఉన్న భూములను మరో 33 ఏళ్ళ పాటు లీజుకు ఇవ్వడానికి కుట్ర పన్నుతున్నారని మల్లాది విమర్శించారు. ఆక్రమణల్లో ఉన్న 87 వేల ఎకరాల భూములను విడిపించడం చంద్రబాబుకు చేతకాలేదు సరికదా ఇప్పుడు మిగిలిన భూములను కూడా తమవారికి శాశ్వతంగా కట్టబెట్టాలని చూస్తు్న్నారన్నారు. దాతలు, హిందూ సంఘాలతో సంప్రదించకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను ఎలా తీసుకుంటుందని విష్ణు ప్రశ్నించారు. వేలం ద్వారా ఇవ్వాల్సిన భూములను కను సైగలతో ఇచ్చేస్తారా అని ఆయన నిలదీశారు. కోర్టు తీర్పులు, ఎండోమెంట్ చట్టాలను కాదని ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటోందని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ ధర్మంపై దాడి చేయడమే అని సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని మల్లాది విష్ణు ప్రశ్రించారు. ప్రభుత్వం వెంటనే ఈ భూ దోపిడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. హిందూ సమాజానికి వైఎస్.జగన్ హయాంలోనే మేలు జరిగిందని కానీ కూటమి భాగస్వామ్య పక్షాలు జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేశారని మల్లాది విష్ణు అన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story