అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 350వ మెట్టు సమీపంలో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అనంతరం భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. దీంతో భక్తులతో గోవింద నామాలు చెప్పిస్తూ సిబ్బంది కొండపైకి పంపిస్తున్నారు. చిరుత కోసం గాలింపు చేపట్టారు. కాగా తిరుమల కొండపైకి వాహనాలు వెళ్ళే మార్గంలో రహదారికి ఆనుకుని ఉన్న ప్రహరీ గోడపై ఠీవీగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కారులో వెళుతున్న భక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రికరించి సోషల్ మీడియాలో పెట్టారు. కారులో ఉన్న భక్తులకు అత్యంత సమీపం నుంచి ప్రహరీ గోడపై చిరుత నడుచుకంటూ కొంత దూరం వెళ్ళిన తరువాతా అడవిలోకి దిగి వెళ్ళిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒళ్ల గగుర్పొడిచే ఈ సన్నివేశం నెట్ లో చక్కర్లు కొడుతోంది. అయితే అలిపిరి మెట్ల మార్గంలో కనిపించిన చిరుత, వాహన మార్గంలో కొండగట్టు ప్రహరీ గోడపై నడుచుకుంటూ వెళుతున్న చిరుతా ఒకటేనే లేక రెండూ వేరు వేరా అన్న విషయంలో స్పష్టత లేదు. గతంలోనూ పలుమార్లు తిరుమలలో చిరుతలు సంచరించిన సంగతి తెలిసిందే. మొత్తానికి తిరుమల గిరులపై జనసంచారం ఉండే ప్రాంతాల్లో చిరుతలు కలియ తిరుగుతున్నాయన్న విషయం నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోతో స్పష్టం అయ్యింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story