తిరుమల గిరులపై అపచారం జరిగింది. ఒక డ్రైవర్ తిరుమల కొండపై ఉన్న కళ్యాణ మండపంలో నమాజ్ పఠించడం కలకలం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్ధానం నిబంధనల ప్రకారం తిరుమల ఏడు కొండలు ప్రాంతంలో అన్య మతస్తులు ప్రార్ధనలు చేయకూడదు. తిరుమల కొండపై అన్యమత ప్రార్ధనలను టీటీడీ నిషేధించింది. అయితే ఈ నింబంధనలను ఉ్లలంఘించి గురువారం ఒక డ్రైవర్ తిరుమలలో సామూహిక వివాహాలు చేసే కళ్యాణ మండపంలో నమాజ్ చేశాడు. టీఎన్ 83 టీ 6705 నెంబరు మారుతీ డిజైర్ వాహనంలో గురువారం మధ్యాహ్నం కొండపైకి వచ్చి కారు పార్కింగ్ చేసి కారులోనే కొంత సమయం కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపటి తరువాత సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలోకి వెళ్లి కింద టవల్ పరుచుని నమాజ్ చేశాడు. ఈ తతంగం అంతా ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో శుక్రవారానికి ఆ వీడియో వైరల్ అవ్వడంతో టీటీడీ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి ఎవరు, ఎవరితో తిరుమల వచ్చాడు అన్న విషయాలను తిరుమల పోలీసులు విచారిస్తున్నారు.

తిరుమలలో నమాజ్ చేయించింది వైకాపా నేతలే

ఇదిలా ఉండగా తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ ఈ నమాజ్ చేయించింది వైఎస్ఆర్సీపీ నాయకులే అని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలకు పాల్పడటం హేయమైన చర్య అని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఈఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. స్వామివారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చెయ్డం హేయమైన చర్య అని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే భానుప్రకాష్ రెడ్డి అరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది వైఎస్ఆర్సీపీ. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలా ప్రతి దానికి కారణం వైఎస్ఆర్సీపీనే అని తప్పించుకోవడం పరిపాటి అయిపోయిందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో అన్నీ అపచారాలే జరుగుతున్నాయని... నిర్వహణ చేతకాక వైసీపీపై ఆరోపణలు చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తు్న్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story