రాష్ట్ర చేనేత, జౌళి శాఖలపై సమీక్ష నిర్వహించిన మంత్రి సవిత

  • నూతన చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేయండి
  • మరింత ఆకర్షణీయంగా ఆప్కోలు
  • చేనేత దుస్తుల అమ్మకాలపై అలసత్వం చూపొద్దు
  • సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయండి
  • నేతన్న సంక్షేమ పథకాలపై సక్సెస్ మీట్ లు నిర్వహించండి

అర్హులైన నేతన్నలందరికీ సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఫలాలు అందజేసేలా గ్రామ స్థాయిలో అవగాహన సదస్పులు నిర్వహించాలన్నారు. ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని, ముఖ్యంగా నూతన డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులపై సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. మంగళగిరిలోని చేనేత, జౌళి శాఖ కమిషనరేట్ లో ఆ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. కమిషనర్ రేఖారాణి చేనేత, జౌళి శాఖలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వన్ డిస్ట్రిక్ – వన్ ప్రొడెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 36 ఉత్పత్తులు గుర్తించినట్లు వివరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వన్ డిస్ట్రిక్ – వన్ ప్రొడక్ట్ గా కింద జిల్లాలో మరిన్ని ఉత్పత్తులను ఎంపిక చేయాలని సూచించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఓడీ ఓపీ అవార్డుల్లో 9 అవార్డుల ఏపీకి రావడం ఆనందకరమంటూ అభినందించారు. వచ్చే ఏడాది మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 93 వేల చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గం కలిగిన 11,488 కుటుంబాలకు 500 యూనిట్లు అందజేస్తున్నామన్నారు. చేనేతలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

డిసెంబర్ లోగా 70 శాతం మేర ముద్ర రుణాలివ్వాలి

2025-26లో ముద్ర రుణాలు ఎంతమందికి ఇచ్చినట్లు మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నేతన్నలందరికీ ముద్ర రుణాల సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలో ఉన్న బ్యాంకర్లతో చర్చించి, రుణాల మంజూరు ఆలస్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్దేశించిన లక్ష్యంలో 70 శాతం మేర ముద్ర రుణాలు అందించాలని స్పష్టంచేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సవిత తెలిపారు.

ఆప్కో అమ్మకాలు పెంచండి

రాష్ట్రంలో ఉన్న 92 ఆప్కో షో రూమ్ ల ద్వారా అమ్మకాలు మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో షో రూమ్ ల ద్వారా గతేడాది 35.60 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కస్టమర్లకు వేగవంతమైన సేవలు అందించాలని, షో రూమ్ లను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు. నూతన డిజైన్లతో రూపొందించిన దుస్తులను షో రూమ్ ల్లో ప్రదర్శనగా పెట్టాలన్నారు. ముఖ్యంగా ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు పెంచాలన్నారు. చేనేత దుస్తుల సోషల్ మీడియా ద్వారా చేనేత దుస్తులపై విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ఎయిర్ పోర్టుల్లో ఉన్న ఆప్కో షో రూమ్ ల్లో చేనేత దుస్తులతో పాటు హస్త కళా రూపాలను కూడా అమ్మకానికి పెట్టాలని మంత్రి సవిత ఆదేశించారు.

సక్సెస్ మీట్ లు నిర్వహించండి

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత చేనేతల సంక్షేమానికి, అభివృద్దికి అమలు చేస్తున్న పథకాల గురించి సక్సెస్ మీట్ లు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. చేనేతలకు 50 ఏళ్లకే రూ.4 వేలపెన్షన్లుఇస్తున్నామన్నారు. ఇటీవల ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. త్రిఫ్ట్ ఫండ్ నిధులు కూడా మంజూరు చేశామన్నారు. 5 శాతం మేర జీఎస్టీ మినహాయింపుపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story