సీఎం చంద్రబాబు ఆదేశాలు

N. Chandrababu Naidu: తెలుగు సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వయం ఆర్థిక స్వావలంబన (సెల్ఫ్ ఫైనాన్స్) మార్గంలో ప్రాజెక్టులను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. క్రీడలు, పర్యాటక రంగాల్లో అమరావతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ) 59వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూమి కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. సీఎం అధికారులకు ఇచ్చిన ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి:

పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరపాలి. వారిని ఆకర్షించేలా వాతావరణం కల్పించాలి.

అమరావతి అభివృద్ధిని స్వయం సమృద్ధితో ముందుకు తీసుకెళ్లాలి.

సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:

సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపుకు ఆమోదం.

తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు, పంచాయతీరాజ్ శాఖలోని ఏపీఎస్‌ఐఆర్‌డీకి 5 ఎకరాల భూమి కేటాయింపు.

సచివాలయం, హైదరాబాద్ వంటి టవర్ల నిర్మాణ పనులకు రూ.2,316 కోట్ల పాలనా అనుమతులు.

రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం.

ఈ నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉందని, సీఎం సూచనలు అమలు చేస్తే రాజధాని త్వరలోనే ఆధునిక, స్వయం సమృద్ధ నగరంగా రూపొందుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story