పశ్చిమబెంగాల్‌, అస్సాంలో ఎన్డీయే దూకుడుపై ఏపీ సీఎం స్పందన

N. Chandrababu Naidu Says: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి విజయం దిశగా సాగుతుండటం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు అభివృద్ధి, సుస్థిర పాలన, సమర్థ నాయకత్వానికి మద్దతు తెలిపారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ దిశను సూచిస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పు అత్యంత కీలకమని అన్నారు.

ఎన్డీయే పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాలకే మద్దతు లభిస్తుందని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయని ఆయన భావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story