డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan Warns: క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. "మేము నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు" అని ఆయన అన్నారు. అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నప్పటికీ, కొన్ని చోట్ల గ్యాప్‌లు (లోపాలు) ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని ఆయన తేల్చి చెప్పారు. పాలసీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

పల్లెపండుగ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు, అడవితల్లి బాటకు రూ.1,005 కోట్లు మంజూరు చేశామని పవన్ కళ్యాణ్ వివరించారు. వివిధ పథకాల అమలుకు మొత్తం రూ.11,328 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.25 వేల కోట్ల మొబిలైజేషన్ చేశామని, ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో అధికారులు ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఏవైనా లోపాలను తక్షణమే సరిచేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి అలసట లేకుండా పనిచేయాలని ఆదేశించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story