ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటన షెడ్యూర్‌ ఖరారయ్యింది. సాయంత్రం 6.40 గంటలకు ప్రధాని మోడీ భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆపీసర్స్‌ మెస్‌ కు వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉయదం 6.25 గంటలకు నేవల్‌ ఆఫీసర్స్‌ మెస్‌ నుంచి బయలుదేరి రామకృష్ణా బీచ్‌ కు చేరుకుంటారు. అక్కడ 6.30 గంటల నుంచి 7.50 గంటల వరకూ నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఆర్కే బీచ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేవల్ ఆఫీసర్స్‌ మెస్‌ కు వెళతారు. అక్కడ 11.45 గంటల వరకూ ప్రధాని రిజర్వ్‌లో ఉంటారు. 11.25 గంటలకు ఐఎన్‌ఎస్‌ సర్కార్ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి హెలీకాఫ్టర్‌ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలదేరతారు. ప్రధాని విశాఖపట్నం చేరుకున్నప్పుడు ఆయనకు ఆహ్వానం పలికే జాబితాలో పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి సతీమణి నాగమణి పేరును కూడా అధికారులు చేర్చారు. ఇక విశాఖకు ప్రధాని రాక సందర్భగా విశాఖ నగర పోలీస్‌ కమీషనర్‌ శంకబ్రత బాగ్చి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు 30 డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ తో సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. వేకలు నిర్వహించే ప్రాంతం నుంచి ఐదు కిలో మీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story