CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం బహుళప్రయోజన ఇరిగేషన్ ప్రాజెక్టును సోమవారం సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.

హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేసిన సీఎం, ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువ-దిగువ కాఫర్‌డ్యామ్‌ల మధ్య జరుగుతున్న పనులు, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం వంటి కీలక అంశాలను సీఎం దగ్గరగా పరిశీలించారు.

అనంతరం ప్రాజెక్టు సైట్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూశారు. ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సందర్శనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు సీఎంతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి, గోదావరి డెల్టా ప్రాంతాలకు ఎంతో మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story