Sharmila: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం భేటీ అయ్యారు. దిల్లీలోని ఈ ముఖ్య సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు.

షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. త్వరలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

భేటీ అనంతరం షర్మిల తన ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్ట్ చేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం, వివిధ అంశాలపై రాహుల్‌ గాంధీ పలు సూచనలు చేశారని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story