ఏపీ సెక్రటేరియెట్ భవనాల టెండర్లు ఖరారు
ఎన్సీసీ, ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్ధలకు దక్కిన టెండర్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇంటిగ్రేటెడ్ సచివాలయం, హెచ్ఐడీ టవర్ల నిర్మాణనికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో ఎల్1 గా నిలిచిన సంస్ధలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఏపీ సెక్రటేరియట్, హెచ్ఐడీ కార్యాలయాల నిర్మాణ టెండర్లను ఎన్సీసీ లిమిటెడ్ సంస్ధ దక్కించుకుంది. ఈ సంస్ధ రూ.882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్ను నిర్మించనుంది. ఇంటిగరేటెడ్ సచివాలయంలోని 1,2 హెచ్ఐడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ సంస్ధ దక్కించుకుంది. రూ.1487.11 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3, 4 హెచ్డీ టవర్ల నిర్మాణ పనులను ఎల్అండ్టీ (లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్) స్వాధీనం చేసుకుంది. ఈ టవర్లను రూ.1303.85 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎల్ 1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలకాభివృద్ధి పట్టణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
