... వైఎస్‌ఆర్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి

మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చంద్రబాబు సన్నిహితుడు టీడీ జనార్ధన్ లు వేరు వేరుగా తాడేపల్లిలోని ఒక విల్లాలోకి వెళ్ళి 45 నిమిషాల తరువాత ఒకరి తరువాత ఒకరు బయటకు వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్ పై విజయసాయి రెడ్డి తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గడచిన మూడు రోజుల నుంచి ఈ సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. ఒక జాతీయ మీడియాకు చెందిన వెబ్ సైట్ ఈ సీసీ ఫుటేజ్ ని బ్రేక్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విజయసాయిరెడ్డిపై మండిపడుతున్నారు. ఇందుకే జగన్ ఆయన్ను దూరం పెట్టారంటూ సోషల్ మీడియలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదు... అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు... నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను అని పోస్ట్ పెట్టారు. ఇంకా ఈ పోస్టులో ఆయన నా రియాక్షన్ వల్ల జగన్ నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరి భావిస్తోందని, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిస మరోసారి వేసుకోలేక బయటకు వచ్చానని చెప్పారు. 2011 లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా జగన్ అడిగి ఉంటే సంబంధం లేకున్నా భాద్యత తీసుకుని ఉందేవాదినేమో అన్నారు. కోటరీనే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారన్నారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా? అని ఆయన ప్రశ్నించారు.

ఆ రోజు నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్ళానని నాకు స్వర్గీయ కృష్ణ కుటుంబంతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్నట్లు చెప్పుకున్నారు. అదే సమయంలో టీడీ జనార్ధన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ ని, చంద్రబాబునే కలుస్తాకానీ వేరేవాళ్ళతో ఎందుకు చర్చిస్తాను అని అన్నారు. వారు గతం లో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను కాబట్టి అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే, ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని ఆయన కోటరీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే గత వారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్ మోహనరెడ్డి ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి చంద్రబాబుకి లొంగిపోయాడని చేసిన ఆరోపణలపై సాయిరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ కౌంటర్ ని కొందరు సర్క్యులేట్ చేశారు. ఆ సందర్భంలో సాయిరెడ్డి ఆ సందేశం తనది కాదని తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు. కానీ ఆదిశేషగిరిరావు ఇంటి వద్ద సీసీ ఫుటేజ్ విషయంలో మాత్రం సాయిరెడ్డి జగన్ కోటరీ పేరుతో ఘాటుగా స్పందించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story