కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు

వైఎస్ఆర్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. నకిలీ పట్టాలకు సంబంధించి గత రెండు రోజులగా కంకిపాడు పోలీసుల కష్టడీలో విచారణను ఎదుర్కొంటున్న వంశీకి శుక్రవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చిన వెంటనే వంశీకి వాంతులు కూడా అయ్యాయి. దీంతో వైద్యలు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే వంశీ అస్వస్ధతకు గురవడంతో పోలీసులు కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారన్న విషయం తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి పేర్ని నానిలు ఆసుపత్రికి చేరుకున్నారు. పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రాజకీయాల్లో ఇటువంటి పరిస్ధితులు ఎప్పుడూ చూడలేదని నానీ వ్యాఖ్యానించారు. కక్ష ఉంటే సంవత్సరం జైలులో పెట్టుకోండి కానీ మనిషిని చంపేయాలను కోవడం దారుణమైన విషయమన్నారు. ఎంత అనారోగ్యంతో బాధ పడుతున్నా వైద్యులతో అంతా బాగుందని రిపోర్టులు రాయిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. వంశీపై కేసుల మీద కేసులు పెట్టి బయటకు రాకుండా చేయాలనుకోవడాన్ని ప్రజల గమనిస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story