హొళగుంద మండలంలో జరిగిన సాంప్రదాయ జైత్రయాత్రలో ఘర్షణ


రెండు వర్గాల మధ్య కర్రలతో దాడులు.. ఆదోని ఆసుపత్రిలో చికిత్స

Devaragattu Festival: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం తర్వాత జరిగిన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు పోటీపడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోవడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు, సుమారు 100 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బన్ని ఉత్సవం ప్రతి ఏటా దసరా సమయంలో దేవరగట్టులో జరుగుతుంది, ఇక్కడ సాంప్రదాయకంగా కర్రలతో మాక్ యుద్ధాలు నిర్వహిస్తారు. అయితే, ఈసారి పోటీ తీవ్రమైన ఘర్షణగా మారడంతో ఈ దుర్ఘటన సంభవించింది. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, దోషులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Next Story