క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో మంత్రి నారా లోకేష్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ కు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. అమరావతి వర్క్ షాప్-2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు. దేశంలో ఓ కీలక మలుపు కానుందని చెప్పారు. భవిష్యత్ లో రాబోయే సాంకేతిక విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఈ సమావేశం ఇస్తోందన్నారు.

అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మార్చాలనేది మా లక్ష్యమని నారాలోకేష్‌ ప్రకటించారు. ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలుగా, ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు. ఇది దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా నిలవబోతోంది. క్యూబిట్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు, ఆల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటమ్ ప్రమాణాల వరకు మేం పూర్తిస్థాయిలో క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తామని లోకేష్‌ తెలిపారు.

చంద్రబాబు మొదటి చాప్టర్ ఐటీ అన్నప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నానని మంత్రి లోకేష్‌ చెప్పారు. దక్షిణాసియా క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు గారి విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచపటంలో అమరావతి క్యాంటమ్ కు చోటు దక్కేలా కృషిచేద్దామని నారా లోకేష్‌ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రోడర్, టీసీఎస్ టెక్నాలజీ, స్టాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి.రాజన్న, ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అడ్వైజర్ ఎంవీ సతీష్, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కే.మధుమూర్తి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోఠి, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story