ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవన విధానాన్ని యోగా మర్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌ లో ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగా డేలో ప్రధాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా సాదన చేయడం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్నారు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని చప్పారు. 175 దేశాలలో యాగా సాధన చేయడం అంటే చిన్న విషయం కాదని, గడచిన పదేళ్ళ కాలంలో యోగా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యోగా చేయడానికి వయసుతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, యోగాకి హద్దులే లేవన్నారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక తార్కాణమన్నారు. యోగా అంతరీక్షంలో కూడా చేశారని ఇండియన్‌ ఆరిజన్‌ అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ స్పేస్‌ లో చిక్కుకుని యాగా సాధన చేసిన పరిస్ధితులను గుర్తు చేసుకుంటూ ప్రధాని ఈ మాట అన్నారు. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అనంతరం దాదాదాపు అర గంట పాటు జరిగిన యోగా ప్రదర్శనలో పాల్గొని అనేయ యోగాసనాలను ప్రధాని నరేంద్ర మోడీ లక్షలాది ప్రజలతో కలసి ప్రదర్శించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story