హీరో కొత్త బైక్ వచ్చేసింది

Hero Xtreme 125R : హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో తన 125సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త గ్లామర్ ఎక్స్ ను విడుదల చేసింది. ఇది భారతదేశంలో క్రూజ్ కంట్రోల్ ఉన్న మొదటి 125సీసీ బైక్. ఇదే లైన్‌లో, ఇప్పుడు హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ను సింగిల్-సీట్ వేరియంట్ ఆప్షన్‌తో అప్‌డేట్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ.లక్షగా నిర్ణయించారు. ఇది స్ప్లిట్-సీట్ ఐబీఎస్ వేరియంట్ (రూ. 98,425) కంటే ఎక్కువగా, కానీ స్ప్లిట్-సీట్ ఏబీఎస్ (ABS) వేరియంట్ (రూ. 1.02 లక్షలు) కంటే కొంచెం తక్కువగా ఉంది.

125సీసీ సెగ్మెంట్‌లో హీరో.. గ్లామర్, గ్లామర్ ఎక్స్, గ్లామర్ ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ వంటి బైక్‌లను అందిస్తోంది. వీటన్నింటిలో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ తన స్పోర్టీ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కొత్తగా వచ్చిన ఈ సింగిల్-సీట్ వేరియంట్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు సీటు డిజైన్‌లో ఉంది. ఇది రైడర్‌కు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, స్ప్లిట్-సీట్ డిజైన్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది కాబట్టి, ఈ సింగిల్-సీట్ బైక్ లుక్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. కొత్త మోడల్, సౌకర్యం కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

కొత్త ఎక్స్‌ట్రీమ్ 125ఆర్​లో ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఇందులో పాత 124.7 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,250 ఆర్‌పీఎంలో 11.4 బీహెచ్‌పీ శక్తిని, 6,000 ఆర్‌పీఎంలో 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ కొత్త మోడల్, తక్కువ ధరకు సౌకర్యాన్ని కోరుకునే వారికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సేఫ్టీ కోసం ఇందులో సింగిల్-ఛానల్ ఏబీఎస్, ఆకర్షణీయమైన స్టైలింగ్ (స్పోర్టీ ట్యాంక్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story