క్రెటాకు గట్టి పోటీ తప్పదు

Maruti : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీ మారుతి ఎర్టిగాలో త్వరలో పెద్ద మార్పులు రానున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఎంపీవీ మొత్తం పొడవు 4.39 మీటర్ల నుంచి 4.43 మీటర్లకు పెరగనుంది. దీని వీల్‌బేస్ 2.74 మీటర్ల వద్దే ఉన్నప్పటికీ, బూట్ స్పేస్ కూడా పెరుగుతుంది. ఎర్టిగా టూర్ M ఫ్లీట్ వేరియంట్ ఇప్పటికే పెద్ద డైమెన్షన్స్‌తో వస్తోంది కాబట్టి, కంపెనీ దీని కొలతలను కూడా ఇంకా పెంచే అవకాశం ఉంది.

2025 మారుతి ఎర్టిగాలో ట్రైన్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా లభిస్తుంది. అలాగే, రెండో వరుస సీట్ల కోసం ఏసీ వెంట్స్‌లో కూడా కొద్దిగా మార్పులు చేశారు. ఇటీవల ఈ ఎంపీవీకి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా జోడించారు. దీంతో దీని ధర కొద్దిగా పెరిగింది. ప్రస్తుతం, ఎర్టిగా 9 వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర 9.11 లక్షల రూపాయల నుంచి 13.40 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

అప్‌డేట్ చేసిన మారుతి ఎర్టిగాలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 102 బీహెచ్‌పీ పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 87 బీహెచ్‌పీ పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది, అయితే కొన్ని పెట్రోల్ వేరియంట్‌లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా లభిస్తుంది.

ఇతర అప్‌డేట్లలో, మారుతి సుజుకి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా కొత్త అరేనా-ఎక్స్‌క్లూజివ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బ్రెజా, గ్రాండ్ విటారా మధ్య ఉండే ఈ కొత్త మోడల్ సెప్టెంబర్ 3, 2025న విక్రయానికి అందుబాటులో ఉంటుంది. దాని అధికారిక పేరు, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఈ కొత్త మారుతి ఎస్‌యూవీకి ఎస్కూడో లేదా విక్టోరిస్ అనే పేర్లు పెట్టే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story