కారు కొనుగోలు చేసిన టీమిండియా సెన్సేషన్

Arshdeep Singh : భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లగ్జరీ కార్ల కలెక్షన్‌లో మరో కొత్త కారును చేర్చుకున్నారు. ఆయన తాజాగా అత్యంత ఖరీదైన, ఐకానిక్ ఎస్‌యూవీ అయిన మెర్సిడెస్-బెంజ్ జీ-క్లాస్‎ను కొనుగోలు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ తన కుటుంబంతో కలిసి కొత్త కారుకు స్వాగతం పలుకుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్-బెంజ్ అత్యంత విలాసవంతమైన మోడల్స్‌లో ఒకటి. అర్ష్‌దీప్ సింగ్ కొనుగోలు చేసింది మెర్సిడెస్-బెంజ్ జీ-క్లాస్ లగ్జరీ ఎస్‌యూవీ. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ గెలిచిన తర్వాత ఆయన ఈ కారును ఇంటికి తీసుకొచ్చారు.

ఈ జీ-క్లాస్ మోడల్‌లో 2925 cc నుంచి 3982 cc వరకు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 325.86 bhp నుంచి 576.63 PS పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. గరిష్టంగా 850 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్ ఉన్న 5-సీటర్ ఎస్‌యూవీ. ఇందులో 667 లీటర్ల బూట్-స్పేస్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

https://www.instagram.com/p/DQ39m8XkjGv/?utm_source=ig_embed&ig_rid=79388ff4-e78f-498f-adf2-33e3a3a9c660

అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఈ లగ్జరీ కారు ధర కోట్లల్లో ఉంది. మెర్సిడెస్-బెంజ్ జీ-క్లాస్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2.55 కోట్లు నుంచి ప్రారంభమై వేరియంట్‌ను బట్టి రూ. 4.30 కోట్ల వరకు ఉంటాయి. అర్ష్‌దీప్ సింగ్ కచ్చితంగా ఏ మోడల్‌ను (ఉదాహరణకు, జీ 350డి లేదా ఏఎమ్‌జీ జీ 63 వంటివి) కొనుగోలు చేశారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అర్ష్‌దీప్ సింగ్ మైదానంలో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆయన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story