తమిళనాడు TASMAC మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు EDని మందలించింది

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)పై సుప్రింకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమిళనాడులో ప్రభుత్వ నిర్వహణలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్(TASMAC) లో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. టాస్మాక్ లో వెయ్యి కోట్ల మేర అక్రమాలు జరిగాయని… మనీ లాండరింగ్ కింద ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
టాస్మాక్ అధికారుల ఇళ్లలో, సంస్థ ప్రధాన కార్యాలయంలో మార్చి,మే నెలల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈడీ సోదాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ఈడీ సోదాలను సమర్థించింది. ఈడీ దర్యాప్తు సహకరించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
తాజాగా సుప్రింకోర్టు ప్రధానన్యాయమూర్తి బీఆర్ గవాయ్ పిటిషన్ను విచారిస్తూ ఈడీ పనితీరును ఆక్షేపించారు. సమాఖ్య పాలన స్పూర్తిని దెబ్బతీసేలా ఈడీ వ్యవహరిస్తోందని ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈడీ హద్దులు మీరుతోందని…వెంటనే దర్యాప్తు ఆపేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది.
సుప్రింకోర్టు తాజా తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
