Gold Price : 2026 నాటికి బంగారం ధర ఎంత పెరుగుతుంది.. బాబా వంగా ఏం చెప్పారంటే ?
బాబా వంగా ఏం చెప్పారంటే ?

Gold Price : బల్గేరియాకు చెందిన అంధ భవిష్యత్తు చెప్పే బాబా వంగ చెప్పిన అనేక జోస్యాలు ఇప్పటికీ నిజమయ్యాయి. అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడి, మయన్మార్లో 2025లో భూకంపం, ప్రిన్సెస్ డయానా మరణ తేదీ వంటి అనేక పెద్ద సంఘటనల గురించి ఆమె ముందే చెప్పగా అవి నిజమయ్యాయి. గత కొంతకాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం, ఆకస్మాత్తుగా తగ్గడంతో బంగారంపై పెట్టుబడి పెట్టే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం గురించి బాబా వంగ చెప్పిన జోస్యం ఏంటో చూద్దాం.
బంగారం చాలా కాలంగా భద్రతకు చిహ్నంగా పరిగణిస్తున్నారు. కానీ ఇటీవల దాని ధరలలో హెచ్చుతగ్గులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్షను కూడా దాటిపోయింది. దీంతో పెట్టుబడిదారులలో కలకలం రేగింది. ఇప్పుడు, 2026లో బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక భౌగోళిక-రాజకీయ పరిణామాల కారణంగా బంగారం ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని నిపుణులు నమ్ముతున్నారు. టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు వంటి అనిశ్చితుల మధ్య దీనికి డిమాండ్ కూడా పెరుగుతోంది. బాబా వంగ జోస్యం ప్రకారం, రాబోయే కాలంలో ప్రపంచం క్రమంగా నగదు సంక్షోభం వైపు పయనిస్తోంది.
లిక్విడిటీ కొరత దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా మాంద్యం సమయంలో బంగారం ధర పెరుగుతుంది. గత ప్రపంచ సంక్షోభాల సమయంలో కూడా బంగారం ధరలు 20% నుండి 50% వరకు పెరిగాయి. ఒకవేళ 2026లో కూడా అలాంటి సంక్షోభం సంభవిస్తే, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధరలు 25% నుండి 40% వరకు పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా వచ్చే ఏడాది దీపావళి నాటికి భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుండి రూ.1,82,000 మధ్య ఉండవచ్చు. ఇది మరొక కొత్త రికార్డు అవుతుంది.

