కస్టమర్ల ఆశలు వదులుకోవాల్సిందేనా ?

Gold Burglary : ఇటీవల కెనరా బ్యాంక్‌లో 59 కిలోల బంగారం చోరీ జరిగిన సంఘటన సంచలనంగా మారింది. అది రుణం కోసం కస్టమర్లు కుదువ పెట్టిన బంగారం. బ్యాంక్‌లలో ఇలా కుదువ పెట్టిన బంగారం, ఆస్తి పత్రాలతో పాటు, కస్టమర్‌లు తమ విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరుచుకుంటారు. ఈ విధంగా బ్యాంక్‌లో ఉంచిన బంగారం లేదా ఇతర వస్తువులు దొంగతనానికి గురైతే ఏమవుతుంది. దొంగతనానికి బ్యాంకే బాధ్యత వహిస్తుంది. కానీ, ఎంతవరకు బాధ్యత వహిస్తుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. దీని గురించి తెలుసుకుందాం.

కెనరా బ్యాంక్ కేసులో జరిగినట్లుగా బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందినప్పుడు, అనుకోకుండా ఆ బంగారం దొంగతనం అయితే నిబంధనల ప్రకారం రుణం తిరిగి చెల్లించే వరకు కుదువ పెట్టిన బంగారం బ్యాంక్ ఆస్తిగానే పరిగణించబడుతుంది. దొంగతనం జరిగితే కస్టమర్‌లకు బంగారం బదులు బంగారాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉండదు. మీరు గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు బంగారం విలువ లేదా అసెస్‌మెంట్ చేయబడుతుంది. బంగారం స్వచ్ఛత, బరువు, దాని విలువ రసీదులో నమోదు చేస్తారు. ఈ రసీదు చాలా ముఖ్యమైన పత్రం. మీ బంగారం దొంగతనం అయినప్పుడు ఈ పత్రమే మీకు ఆధారంగా ఉంటుంది. ఇందులో నమోదు చేయబడిన విలువకు సమానమైన డబ్బును బ్యాంక్ అందిస్తుంది.

బ్యాంక్ ఈ మొత్తాన్ని బాకీ ఉన్న రుణం నుంచి మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తుంది. బంగారం కుదువ పెట్టి ఒక సంవత్సరం కంటే ఎక్కువ అయి ఉండి, ప్రస్తుతం దాని మార్కెట్ విలువ గణనీయంగా పెరిగితే, పెరిగిన విలువను క్లెయిమ్ చేయమని బ్యాంక్‌ను అడగవచ్చు. అయితే, దీనికి బ్యాంక్ అంగీకరించాలనే నిబంధన మాత్రం లేదు.

ఇంట్లో బంగారం ఉంచుకోవడం సురక్షితం కాదని భావించి, మీరు బ్యాంకు లాకర్‌లో విలువైన వస్తువులను ఉంచి ఉండవచ్చు. ఒకవేళ లాకర్ దొంగతనం ద్వారా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే లాకర్ వార్షిక అద్దెకు కేవలం 100 రెట్లు మాత్రమే పరిహారంగా లభించవచ్చు. ఉదాహరణకు, మీరు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను లాకర్‌లో ఉంచినప్పటికీ మీకు అంత మొత్తానికి పరిహారం లభించదు. ఒకవేళ లాకర్ వార్షిక అద్దె రూ.5000 అయితే కేవలం రూ.5 లక్షలు మాత్రమే తిరిగి వస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story