ఇంటి దగ్గరే KYC క్యాంపులు!

KYC Update : ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయింది. ఈ పథకం కింద తెరిచిన అనేక బ్యాంక్ ఖాతాలకు ఇప్పుడు రీ-కేవైసీ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్యాంపులు జులై 1 నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయి.

క్యాంపులలో లభించే సేవలు

ఈ పంచాయతీ లెవల్ క్యాంపులలో కేవలం రీ-కేవైసీ మాత్రమే కాదు. మీ అకౌంట్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు. అలాగే, కొత్తగా అకౌంట్లు తెరవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. మీ ఇంటి దగ్గరే వచ్చిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని బ్యాంక్ సేవలు పొందవచ్చు.

రీ-కేవైసీకి ఏఏ డాక్యుమెంట్లు అవసరం?

మీ పేరు, అడ్రస్ మారకపోతే: మీ పేరు, చిరునామాలో ఎటువంటి మార్పులు లేకపోతే, మీరు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ నింపితే సరిపోతుంది.

మీ పేరు, అడ్రస్ మారితే: ఒకవేళ మీ పేరు లేదా చిరునామాలో మార్పులు ఉంటే, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఆర్‌బీఐ ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ సరిపోతుంది:

* ఆధార్ కార్డు

* ఓటర్ ఐడీ

* నరేగా జాబ్ కార్డు

* డ్రైవింగ్ లైసెన్స్

* పాస్‌పోర్ట్

* నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జారీ చేసిన లేఖ

రీ-కేవైసీ ఎందుకు ముఖ్యం?

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందే నిధులు నేరుగా ఈ జనధన్ ఖాతాలలోకి బదిలీ అవుతాయి. ఒకవేళ ఈ ఖాతాలకు రీ-కేవైసీ పూర్తి చేయకపోతే, వాటిని నిరుపయోగంగా పరిగణించి, నిధుల బదిలీని నిలిపివేసే అవకాశం ఉంది. అందుకే మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి రీ-కేవైసీ తప్పనిసరి.

మరిన్ని సేవలు

ఈ క్యాంపులలో రీ-కేవైసీతో పాటు, ప్రజలకు మైక్రో ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కల్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాంటి పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ప్రజలను ప్రోత్సహిస్తారు. అలాగే ఆర్‌బీఐ బాండ్ల గురించి కూడా వినియోగదారులకు వివరిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story