అమెరికా, యూకే, చైనా నుంచి ఎక్కువ ఆసక్తి

Foreign Companies: అమెరికా, యూకే, చైనా, హాంగ్‌కాంగ్‌లోని 60 శాతానికి పైగా కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని తాజా సర్వే వెల్లడించింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ విడుదల చేసిన 'ఫ్యూచర్ ఆఫ్ ట్రేడ్: రెజిలియెన్స్' అనే నివేదిక ప్రకారం, ఈ దేశాల్లోని చాలా కంపెనీలు భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావిస్తున్నాయి.

సుంకాలు, టారిఫ్‌ల వంటి సవాళ్లతో పాటు ఆధునిక సాంకేతికతలు, ఆర్థిక వృద్ధి వంటి అంశాలు ఈ ఆసక్తికి కారణమవుతున్నాయి. ఈ సర్వేలో 17 ప్రధాన మార్కెట్లు, నాలుగు పరిశ్రమల నుంచి 1,200 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలు సేకరించబడ్డాయి. దాదాపు సగం మంది సర్వేకారులు భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలను విస్తరించాలని లేదా కొనసాగించాలని ఆశిస్తున్నారు. ప్రతి ఐదు కంపెనీల్లో రెండు కంపెనీలు దేశంలో తమ తయారీ ఒప్పందాలను పెంచడానికి లేదా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్యంగా, అమెరికా, యూకే, మెయిన్‌ల్యాండ్ చైనా, హాంగ్‌కాంగ్‌లోని కార్పొరేట్‌లు భారత్‌తో వ్యాపార సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాయి. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడానికి, సమర్థతను పెంచడానికి కస్టమర్లు తమ అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా గొలుసు వ్యవస్థలను మెరుగుపరచాలని స్టాండర్డ్ చార్టర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సున్ లోయ్ పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story